Friday, September 20, 2024
Homeక్రైమ్42 రోజుల శిశువును బలి తీసుకున్న కుక్క

42 రోజుల శిశువును బలి తీసుకున్న కుక్క

మానుకోట జిల్లాలో దారుణం..
స్పాట్ వాయిస్, తొర్రూరు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. మండలంలోని మడిపల్లిలో సోమవారం కుక్క దాడిలో 42 రోజుల శిశువు మృతి చెందాడు. మడిపల్లికి చెందిన రేణుకకు నెల్లికుదురు మండలం చెట్ల ముప్పారం గ్రామానికి చెందిన దర్శనం వెంకన్నతో వివాహమైంది. ప్రసవం కోసం రేణుక తల్లిగారింటికి రాగా 42 రోజుల క్రితం మగ శిశువుకు జన్మనిచ్చింది. సోమవారం ఉదయం 8 గంటలకు రేణుక, ఆమె తల్లి వెంకటమ్మ బయట పనుల్లో ఉన్న సమయంలో ఓ కుక్క ఇంట్లోకి చొరబడింది. మంచంలో నిద్రిస్తున్న శిశువును తలపై తీవ్రంగా గాయపర్చింది. ఆ పసికందు ఏడుపు శబ్దం విని వారిద్దరు ఇంట్లోకి వెళ్లి చూడగా తీవ్రగాయాలతో కనిపించాడు. వెంటనే తొర్రూరులోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో 108లో వరంగల్‌ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అల్లారుముద్దుగా చూసుకుంటున్న బిడ్డను కుక్క వచ్చి బలితీసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments