Monday, March 10, 2025
Homeక్రైమ్అడ్డుగా ఉన్నాడని హత్యకు ప్లాన్..

అడ్డుగా ఉన్నాడని హత్యకు ప్లాన్..

అడ్డుగా ఉన్నాడని హత్యకు ప్లాన్..
అడ్డంగా దొరికిన భార్య..
వివాహేతర బంధం కోసం బరితెగింపు
ప్రియుడు శామ్యూల్, సహకరించిన ఏఆర్ కానిస్టేబుల్ అరెస్ట్
వివరాలు వెల్లడించిన ఏసీపీ నందిరామ్ నాయక్
స్పాట్ వాయిస్, వరంగల్ క్రైం: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తనే చంపించేందుకు ప్లాన్ వేసింది భార్య. ఇటీవల వరంగల్ వైద్యుడిపై హత్యాయత్నం కేసును మిల్స్ కాలనీ పోలీసులు ఛేదించారు. డాక్టర్ భార్యే ప్రధాన సూత్రధారిగా తేల్చారు. నిందితురాలు గాదె ఫ్లోరా మరియా (వరంగల్), ఆమె ప్రియుడు ఏర్రోళ్ల శామ్యూల్ (సంగారెడ్డి), వీరికి సహకరించిన ఏఆర్ కానిస్టేబుల్ మంచుకురి రాజ్ కుమార్ (సంగారెడ్డి)ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. ఈమేరకు వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ కేసు వివరాలను వెల్లడించారు. వరంగల్ కు చెందిన డాక్టర్ సుమంత్ రెడ్డికి ఫ్లోరా మరియాతో 2016 లో ప్రేమ వివాహం జరిగింది. 2018లో సంగారెడ్డిలో సుమంత్ రెడ్డి బంధువుల విద్యాసంస్థలు ఉండగా వాటిని చూసుకోవడానికి అతని భార్య ఫ్లోరా మరియా, డాక్టర్ సుమంత్ రెడ్డి సంగారెడ్డికి షిఫ్ట్ అయ్యారు. అక్కడ డాక్టర్ సుమంత్ రెడ్డి సంగారెడ్డి పీహెచ్ సీలో కాంట్రాక్టు పద్ధతిన మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తుండగా, ఫ్లోరా స్కూల్లో టీచర్ గా పని చేస్తోంది.

కొంప ముంచిన జిమ్ సెంటర్
ఫ్లోరా బరువు తగ్గడానికి సంగారెడ్డిలోని సిద్ధు జిమ్ సెంటర్ కి వెళ్తుండేది. జిమ్ సెంటర్లో కోచ్ గా పని చేస్తున్న ఏర్రోల్ల శామ్యూల్ పరిచయమయ్యాడు. పరిచయం కాస్తా వివాహేతర బంధంగా మారింది. ఈ విషయం సుమంత్ రెడ్డికి తెలియడంతో కుటుంబలో గొడవలు మొదలయ్యాయి. దీంతో డాక్టర్ సుమంత్ రెడ్డి ఫ్యామిలీతో వరంగల్ కు మకాం మార్చారు. 2019లో ఫ్లోరా మరియా లెక్చరర్ ఉద్యోగం సాధించి జనగామ జిల్లాలోని పెంబర్తి సోషల్ వెల్ఫేర్ కాలేజీలో విధులు నిర్వహిస్తూ అక్కడే ఉండేవారు. తర్వాత కాలేజీ వరంగల్ లోని రంగశాయిపేటకు మారడంతో డాక్టర్ సుమంత్ రెడ్డి వరంగల్ ని వాసవి కాలనీలో ఉంటూ కాజీపేటలో ప్రైవేట్ హాస్పిటల్ నడుపుకుంటూ ఉదయం వెళ్లి రాత్రి తన ఇంటికి వస్తుండేవాడు.
శ్యామూల్ ను మరిచిపోని ఫ్లోరా..
ఫ్లోరా మరియా సంగారెడ్డిలో పరిచయమై శామ్యూల్ తో తరచుగా ఫోన్ లో మాట్లాడడం వీడియో కాల్స్ మాట్లాడడం డాక్టర్ సుమంత్ రెడ్డి లేని సమయంలో అతడిని ఇంటికి పిలిపించుకునేది. ఇది తెలుసుకున్న డాక్టర్ సుమంత్ రెడ్డి ఆమెను మందలించేవారు. ఈ విషయంలో వారిద్దరి మధ్య తరుచుగా గొడవలు జరుగుతుండేవి. దీంతో ఫ్లోరా మరియా, శామ్యూల్ డాక్టర్ ను ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. శామ్యూల్ ఈ విషయాన్ని స్నేహితుడైన ఏఆర్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ కు చెప్పాడు. డాక్టర్ సుమంత్ రెడ్డి హత్యకి సహకరిస్తే సంగారెడ్డిలో ఇల్లు కట్టిస్తానని చెప్పగా హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ ఒప్పుకొన్నాడు.
లక్ష రూపాయలు..
ఫ్లోరా మరియా 15 రోజుల క్రితం లక్ష రూపాయలను శామ్యూల్ కి పంపింది. అందులో నుంచి ఖర్చులకు రూ. 50 వేలు శామ్యూల్ తీసుకోని, మిగిలిన 50 వేలను ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ కు ఇచ్చాడు. ఈనెల 20వ తేదీన మధ్యాహ్నం సంగారెడ్డిలో సుత్తిని కొనుగోలు చేసి రాజకుమార్ రాయల్ ఎన్ ఫీల్డ్ మోటార్ సైకిల్ పై బయలుదేరి కాజీపేటకు వచ్చి ముందుగా వారు అనుకున్న ప్రకారం డాక్టర్ సుమంత్ రెడ్డిని హత్యచేసేందుకు సీసీ కెమెరాలు, జనసంచారం లేని చీకటి ప్రదేశాన్ని ఎంచుకున్నారు. సుమంత్ రెడ్డి రాత్రి తన క్లినిక్ ముగించుకొని కారులో బట్టుపల్లి రోడ్డు నుంచి రంగాశాయపేట వెళ్తున్న క్రమంలో వెనుకే వచ్చిన శామ్యూల్, రాజ్ కుమార్ డాక్టర్ సుమంత్ రెడ్డి కారును ఆపి విచక్షణారహితంగా కొట్టి గాయపర్చారు. చనిపోయాడని భావించి అక్కడి నుంచి వారు పారిపోయారు. డాక్టర్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఈ కేసును వరంగల్ ఏసీపీ నంది రామ్ ఆధ్వర్యంలో మిల్స్ కాలనీ సీఐ వెంకటరత్నం దర్యాప్తు చేసి ప్రత్యక బృందాలుగా ఏర్పడి నిందితులను అరెస్ట్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments