Saturday, September 21, 2024
Homeరాజకీయంనేను పార్టీ మారా..

నేను పార్టీ మారా..

ఓడిపోయిన బాధ ఉంది..
తప్పుడు ప్రచారం చేయొద్దు ప్లీజ్..
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
స్పాట్ వాయిస్, బ్యూరో: తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై బీఆర్‌ఎస్‌ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పందించారు. పార్టీ మారే ఆలోచన తనకు లేదని.. కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డితో కలిసి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందని కొంత బాధ అయితే ఉందని.. కానీ పార్టీ మారే ఆలోచన ఏ మాత్రం లేదని స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామనే దానిపై రివ్యూ మీటింగ్‌లు నిర్వహించానని, పార్టీ మారేందుకు కాదని ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఏ మండలం, ఏ గ్రామంలో ఎలాంటి ఫలితాలు వచ్చాయి.. ఎవరు పనిచేశారనే దానిపై సమీక్షలు చేశానని పేర్కొన్నారు. ఆ సమయంలోనే తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించానని చెప్పారు. కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలన్నదే తన ధ్యేయమని తెలిపారు. దానికోసమే సిద్ధంగా ఉన్నానని చెప్పారు. దయచేసి తనపై తప్పుడు ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments