Thursday, April 17, 2025
Homeలేటెస్ట్ న్యూస్శ్రమకు తగిన ఫలితం ఏదీ...?

శ్రమకు తగిన ఫలితం ఏదీ…?

రోడ్డెక్కిన ఉపాధి కూలీలు
– పనికి తగ్గ కూలీ రేట్లు రావడం లేదంటూ ధర్నా
– స్తంభించిన ట్రాఫిక్

స్పాట్ వాయిస్‌, గణపురం: భూపాలపల్లి జిల్లా   గణపురం మండల కేంద్రంలో ఉపాధిహామీ కూలీలు రోడ్డెక్కారు. చేసిన పనులకు సరైన కూలీ రావడం లేదంటూ గణపురం ములుగు ప్రధాన రహదారిపై ఆందోళన నిర్వహించారు. పొట్టకూటి కోసంమండుటెండలో పనులు చేస్తే అధికారులు కూలీ రేట్లు సరిగా ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు. .తమకు పనికి తగ్గ కూలి రావడంలేదని అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో విసుగెత్తి ఇలా రోడ్డెక్కి ధర్నాకు దిగినట్లు తెలిపారు. అధికారులు హామీ ఇచ్చేంత వరకూ ఆందోళన విరమించేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. సుమారు రెండు గంటల నుంచి రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments