Saturday, September 21, 2024
Homeజిల్లా వార్తలుతెలంగాణలోనే అభివృద్ధి

తెలంగాణలోనే అభివృద్ధి

ఎమ్మెల్యే అరూరి రమేశ్
హైలెవల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన
స్పాట్ వాయిస్, హన్మకొండ: ఉమ్మడి రాష్ర్టంలో ఏ ప్రభుత్వం చేయని, దేశంలోని ఏ రాష్ర్టంలో జరగని అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వం చేసి చూపిస్తోందని టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 56వ డివిజన్ పరిధిలోని సప్తగిరి కాలనీ వడ్డేపల్లి చర్చి నుంచి ఉనికిచర్ల వెళ్లే రోడ్డులో రూ. 6.80కోట్లతో నిర్మించనున్న హైలెవల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్యతో కలిసి ఎమ్మెల్యే అరూరి రమేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వర్ధన్నపేట నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రభాగాన నిలపడమే లక్ష్యమన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో రాజీ పడేప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎన్నోఏళ్లుగా పెండింగ్ లో ఉన్న అనేక పనులను టీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తి చేస్తున్నామని చెప్పారు. నియోజకవర్గ పరిధిలోని డివిజన్ల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ప్రతీ గడపకు లబ్ధి చేకురేలా సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సిరంగి సునీల్ కుమార్, డివిజన్ ప్రెసిడెంట్ రుద్రోజు మనింద్రనాథ్, బల్దియా అధికారులు, డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments