Friday, September 20, 2024
Homeక్రైమ్ప్రాణం తీసిన దాగుడుమూతలు

ప్రాణం తీసిన దాగుడుమూతలు

ప్రాణం తీసిన దాగుడుమూతలు
కన్నెపల్లిలో విషాదం
స్పాట్ వాయిస్, క్రైమ్ : అప్పటి దాకా సరదాగా ఆడుకున్న బాలుడి ఆయువు ఒక్క సారిగా ఆగిపోయింది. తన కూతురు, కుమారుడితో కలిసి దాగుడుమూతలు ఆడుకుంటున్న పెద్దకొడుకు ప్రాణం పోవడంతో ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. దీంతో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండం కన్నెపల్లిలో విషాదం నెలకొంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చెన్నూరి కైలాష్, రుమలకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు వారి వారి పనులకు వెళ్లడంతో అభిషేక్ (12) తన తమ్ముడు హర్షిత్, చెల్లి అవంతికతో కలిసి దాగుడుమూతలు ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో వారికి దొరకొద్దని ఇంట్లో నిల్వ ఉన్న పత్తిలో చిన్న రంధ్రం చేసి అందులో దాక్కున్నాడు. ఈ క్రమంలో ఊపిరాడక అభిషేక్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అన్నయ్య పరిస్థితి గమనించిన పిల్లలు కేకలు వేయడంతో పొరుగు వారు వచ్చి బాలుడిని బయటకు తీసి, వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా, అభిషేక్ స్థానిక ప్రైవేటు పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. దీంతో కన్నెపల్లిలో విషాదం నెలకొంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments