Friday, September 20, 2024
Homeక్రైమ్పొలానికి నీరు పెడుతుండగా కరెంట్ షాక్..

పొలానికి నీరు పెడుతుండగా కరెంట్ షాక్..

అక్కడికక్కడే రైతు మృతి
మానుకోట జిల్లాలో విషాదం
స్పాట్ వాయిస్, కొత్తగూడ: మహబూబాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన రైతు మృత్యువాత పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే కొత్తగూడ మండలం చెరువు ముందు తండాకు చెందిన దారావత్ లక్పతి బుధవారం పొలానికి వ్యవసాయ బావి నుంచి నీళ్లు పారించడానికి వెళ్లాడు. మోటారు ఆన్ చేస్తున్న క్రమంలో కరెంట్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పంట పొలంలోనే విఘత జీవిగా పడి ఉన్న లక్పతిని చూసి కుటుంబ సభ్యులు, తండా వాసులు బోరున విలపించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments