Saturday, September 21, 2024
Homeక్రైమ్నల్లబెల్లం పట్టివేత

నల్లబెల్లం పట్టివేత

నల్లబెల్లం పట్టివేత
మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం
స్పాట్ వాయిస్,కేసముద్రం: కేసముద్రం మండలం పెనుగొండ గ్రామ సమీపంలో రూటు వాచ్ నిర్వహిస్తుండగా మూడు ద్విచక్ర వాహనాలపై అక్రమంగా తరలిస్తున్న క్వింటా యాభై కిలో ల నల్ల బెల్లాన్ని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. బెల్లాన్ని ఇప్పల తండా , చక్ర తండాకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు నుంచి కొనుగోలు చేసి రైల్లో తెచ్చారు. తండాకు తరలిస్తున్న క్రమంలో పోలీసులకు చిక్కారు. ఇప్పల్ తండాకు చెందిన లచ్చిరాం, చక్రుతండాకు చెందిన లకావత్.శీను, లకావత్.బాలులపై కేసులు నమోదు చేశారు. తనిఖీల్లో గూడూరు ఎక్సేంజ్ సీఐ.బిక్షపతి, హెడ్ కానిస్టేబుల్ బుచ్చయ్య, కానిస్టేబుల్ లు సుధాకర్, యుగంధర్, పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments