Friday, September 20, 2024
Homeక్రైమ్భార్య గొంతు కోసిన భర్త..

భార్య గొంతు కోసిన భర్త..

మహబూబాబాద్ లో దారుణం

అనుమానంతోనే హత్య..!
స్పాట్ వాయిస్ , మానుకోట: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. పట్టణంలోని అడ్వకేట్ కాలనీలో జాటోత్ భాస్కర్ అనే వ్యక్తి తన భార్య కల్పన(30) గొంతు కోసి హత్య చేశాడు. ఉదయం కల్పన పనికి వెళ్తుండగా భాస్కర్ అడ్వకేట్ కాలనీలో ఈ దారుణానికి తెగించాడు. కల్పన ఇళ్లలో పనిచేస్తుండగా భాస్కర్ మటన్ కొడుతుంటాడని సమాచారం. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. భార్య కల్పనపై అనుమానంతోనే భాస్కర్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలిసింది. సమాచారం అందగానే స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కల్పన మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments