Wednesday, April 9, 2025
Homeక్రైమ్కన్నతల్లిని గొడ్డలితో నరికిన కొడుకు

కన్నతల్లిని గొడ్డలితో నరికిన కొడుకు

కన్నతల్లిని గొడ్డలితో నరికిన కొడుకు..

అడ్డు వచ్చిన మరో మహిళపై దాడి 

స్పాట్ లోనే తల్లి మృతి

 కొన ఊపిరితో మరో మహిళ

గొడ్డలితో గ్రామంలో తిరుగుతూ నిoదితుడి హల్ చల్

పోలీసుల అదుపులో నిoదితుడు 

స్పాట్ వాయిస్, రేగొండ: భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరిలో దారుణం జరిగింది. కంచరకుంట్ల రాజు (40) కొన్ని రోజుల క్రితం మతిస్థిమితం కోల్పోయి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించే వాడు.గురువారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కన్నతల్లిని గొడ్డలితో విచక్షణా రహితంగా నరికి చంపాడు. గమనించిన పక్కింట్లో ఉండే మహిళ అడ్డుపడ గా మహిళ తల పై గొడ్డలితో నరకాడు. కొన ఊపిరితో ఉన్న ఆమెను చుట్టుపక్కల వారుఅంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. నిందితుడు రాజు స్థానికుల నుంచి తప్పించుకొని గొడ్డలితో ఊరందరిని చంపేస్తా అంటూ భయభ్రాంతులకు గురి చేశాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగి రాజు గాలించగా.. చిన్న కొడపాకలో ఉండగా అదుపులోకి తీసుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments