Monday, September 23, 2024
Homeక్రైమ్రోడ్డు దాటుతుండగా.. లారీ ఢీకొని వ్యక్తి మృతి

రోడ్డు దాటుతుండగా.. లారీ ఢీకొని వ్యక్తి మృతి

రోడ్డు దాటుతుండగా.. లారీ ఢీకొని వ్యక్తి మృతి
– గాంధీనగర్ లో ఘటన
స్పాట్ వాయిస్, గణపురం: జయశంకర్ జిల్లా మండలంలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. గాంధీనగర్ గ్రామానికి చెందిన దల్బంజన్ రాజు (35) శనివారం రాత్రి వర్షంలో గొడుగు పట్టుకొని రోడ్డు దాటుతుండగా పరకాల నుంచి భూపాలపల్లి వైపు వెళుతున్న ఓ లారీ అతి వేగంగా వచ్చి ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో రాజు రెండు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 వాహనంలో క్షతగాత్రుడిని వరంగల్ ఎంజీఎంకు తరలించారు. కాగా రాజుకు తీవ్ర రక్తస్రావం జరగడంతో ఎంజీఎంలో మృతి చెందాడు. మృతుడికి భార్య కూతురు, కుమారుడు ఉన్నారు. భార్య స్వప్న ఫిర్యాదు మేరకు ఎస్సై అభినవ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments