Thursday, April 17, 2025
Homeజిల్లా వార్తలుచికిత్స పొందుతూ వ్యక్తి మృతి

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

స్పాట్ వాయిస్, గణపురం: రోడ్డు ప్రమాదంలో గాయాలపాలై వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని కొండాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మామిడి పవన్ (34) మాధవరావుపల్లి సింగరేణి ఓసీ 3లో లోడర్ డ్రైవర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ నెల 16న విధులు ముగించుకొని తన ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వస్తున్న క్రమంలో రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోయి బైక్ అదుపు తప్పి పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు భూపాలపల్లి సింగరేణి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, బుధవారం చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి మామ పాశం సాంబయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మచ్చ సాంబమూర్తి తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments