Saturday, April 19, 2025
Homeక్రైమ్భవనంపై నుంచి నెట్టి.. ఆపై గొంతు నులిమి...

భవనంపై నుంచి నెట్టి.. ఆపై గొంతు నులిమి…

కొడుకును చంపిన సవతి తల్లి
స్పాట్ వాయిస్, క్రైమ్: హైదరాబాద్ లోని కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోల్నాకలో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలుడిని సవతి తల్లి హత్య చేసింది. సీఐ హబీబుల్లా తెలిపిన వివరాల మేరకు.. భాస్కర్‌ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి గోల్నాకలో నివాసం ఉంటున్నాడు. 15 రోజుల క్రితం అతడి కుమారుడు ఉజ్వల్‌ (7) భవనంపై నుంచి కింద పడిపోగా గాయాలయ్యాయి. బాలుడిని ఆస్పత్రిలో చేర్పించగా కోలుకుని ఇంటికి వచ్చాడు. ఆదివారం ఉజ్వల్‌ను సవితి తల్లి సరిత గొంతు నులిమి హత్య చేసింది. అయితే బాలుడి మృతిపై అనుమానం వ్యక్తం చేసిన తండ్రి భాస్కర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. సవతి తల్లి సరిత కొడుకును హత్య చేసినట్లు తేలింది. బిల్డింగ్‌పై నుంచి ఉజ్వల్‌ను నెట్టివేసినా చనిపోకవడంతో.. గొంతు నులిమి హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది. దీంతో పోలీసులు హత్య కేసు నమోదు చేసి సరితను అరెస్టు చేసిన కాచిగూడ పోలీసులు స్టేషన్‌కు తరలించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments