Tuesday, May 27, 2025
Homeజిల్లా వార్తలుహార్ట్ స్ట్రోక్ తో కేసముద్రం తహసీల్దార్ మృతి..

హార్ట్ స్ట్రోక్ తో కేసముద్రం తహసీల్దార్ మృతి..

హార్ట్ స్ట్రోక్ తో కేసముద్రం తహసీల్దార్ మృతి..

స్పాట్ వాయిస్, మహబూబాబాద్ : కేసముద్రం తహసీల్దార్ ఫరిదోద్దీన్ (52) గుండెపోటుతో బుధవారం రాత్రి మృతి చెందారు. కేసముద్రం మండల కేంద్రంలో ప్రభుత్వం నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే శంకర్ నాయక్,ఇతర ప్రజా ప్రతినిధులతో పాటు తహసీల్దార్ పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి వెళ్లి అస్వస్థతకు గురయ్యారు. గమనించిన కారు డ్రైవర్ వెంటనే తహసీల్దార్ ను కారులో కేసముద్రం మండల కేంద్రంలో ఓ ప్రైవేటు వైద్యునికి చూపించాడు. తహసీల్దార్ గుండెపోటుకు గురైనట్లు నిర్ధారించి వెంటనే మహబూబాబాద్ కు తరలించాలని సూచించారు. వెంటనే తహసీల్దార్ ను కారులో మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించి సీ పీఆర్ చేసి చికిత్స అందిస్తుండగా రాత్రి 11 గంటల ప్రాంతంలో మృతి చెందారు. తహసిల్దార్ కు గుండెపోటు వచ్చిందని విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే శంకర్ నాయక్ హుటాహుటిన ఏరియా ఆసుపత్రికి వచ్చారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments