Saturday, September 21, 2024
Homeక్రైమ్భార్యను చంపిన భర్త..!

భార్యను చంపిన భర్త..!

అనుమానం తో హత్య చేసిన వైనం

స్పాట్ వాయిస్, మల్హర్: మండలంలోని రుద్రారం గ్రామంలో బుధవారం ఉదయం దారుణ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన మూడెత్తుల రమేష్ ,లక్ష్మి దంపతులు. కాగా గత కొంత కాలంగా వీరి మద్య ఘర్షణలు జరుగుతున్నాయి. మంగళవారం కొయ్యూరు పోలీస్ లు స్థానిక పోలీస్ స్టేషన్ లో కుటుంబ సభ్యుల సమక్షంలో భార్య భర్త లకు కౌన్సిలింగ్ నిర్వహించి ఇంటికి పంపించారు. అనంతరం బుధవారం తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో భర్త రమేష్ భార్య లక్ష్మి ని గొంతు నులిమి హత్య చేసినట్లు తెలుస్తుంది. సంఘటన స్థలానికి చేరుకున్న కొయ్యూరు,కాటారం పోలీస్ లు మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మహాదేవపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాటారం సీఐ రంజిత్ రావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments