Thursday, September 19, 2024
Homeక్రైమ్బావిలో దూకి వివాహిత ఆత్మహత్య..

బావిలో దూకి వివాహిత ఆత్మహత్య..

వ్యవసాయ బావిలో దూకి వివాహిత ఆత్మహత్య

స్పాట్ వాయిస్ ,(నర్సంపేట) చెన్నారావుపేట: వ్యవసాయ బావిలో దూకి వివాహిత ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన మండలంలోని అక్కల్ చెడ గ్రామ శివారు హర్య నాయక్ తండాలో ఆదివారం చోటుచేసుకుంది. ఇదే తండాకు చెందిన ఇస్లావత్ రూఫ్ల- పోరి దంపతుల కుమారుడు తిరుపతితో మండలంలోని కాల్ నాయక్ తండా గ్రామ శివారు బాల్ నాయక్ తండాకు చెందిన లావుడ్య బద్రు- చీని దంపతుల కుమార్తె త్రిష (23) తో రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఆరు నెలల పాప ఉంది. తిరుపతి పోస్టల్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం చేస్తున్నాడు. భార్యాభర్తల మధ్య డబ్బుల విషయంలో ఆదివారం ఉదయం గొడవ జరిగింది. దీంతో మనస్థాపానికి గురైన త్రిష ఇంటి వెనకాల ఉన్న వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో అగ్నిమాపక శాఖ ఎస్ఎఫ్ఓ జైపాల్ రెడ్డి, ఎల్ ఎఫ్ వీరన్న, సిబ్బంది మధుసూదన్, రవి, సాంబయ్య, పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఇస్తారి సంఘటన స్థలానికి చేరుకొని తండా వాసుల సహాయంతో వ్యవసాయ బావిలో నుండి మృతదేహాన్ని బయటికి తీయించారు. అనంతరం మృతదేహాన్ని నర్సంపేట పోస్టుమార్టంకు తరలించారు. మృతురాలి తండ్రి లావుడ్య బద్రు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తోట మహేందర్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments