Friday, September 20, 2024
Homeక్రైమ్పెను విషాదం.. కూలీల ట్రాలీని ఢీకొన్న లారీ

పెను విషాదం.. కూలీల ట్రాలీని ఢీకొన్న లారీ

స్పాట్ వాయిస్, దామెర:   హనుమకొండ జిల్లా శాయంపేట మండలం మందారిపేట వద్ద కూలీలతో వెళ్తున్న వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ట్రాలీ లో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు . మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలిసింది.
వివరాల్లోకి వెళితే… శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన 25 మంది మహిళలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో మిర్చి  వేరే అందుకు శుక్రవారం ఉదయాన్నే మొగుళ్లపల్లి కు చెందిన ట్రాలీ లో బయలుదేరారు.  కొద్ది సేపటికే ఎదురుగా వస్తున్న లారీ సైడ్ నుంచి తగలడంతో ర్యాలీలో సైడ్ నిలబడిన వారందరినీ గుద్దుకుంటూ వెళ్లింది. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి . విషయం తెలుసుకున్న పరకాల ఏసీపీ సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ వారిని వరంగల్ ఎంజీఎం కు అదే ట్రాలీ లో చికిత్స నిమిత్తం తరలించారు.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments