Sunday, September 22, 2024
Homeక్రైమ్బ్యాటరీ దొంగల అరెస్టు

బ్యాటరీ దొంగల అరెస్టు

బ్యాటరీ దొంగల అరెస్టు
– నలుగురికి జైలు

స్పాట్ వాయిస్, గణపురం: జల్సాల కోసం చోరీలకు పాల్పడుతున్న నలుగురిని శనివారం గణపురం పోలీసులు అరెస్టు చేశారు. మండలంలో బ్యాటరీ దొంగతనాలకు సంబంధించిన దొంగల వివరాలను మీడియా సమావేశంలో ఎస్సై అభినవ్  వెల్లడించారు. వాహన బ్యాటరీలే లక్ష్యంగా చేసుకుని దొంగతనానికి పాల్పడుతన్న చెల్పూర్ గ్రామానికి చెందిన మూగల చందర్, బానాల శ్రీకాంత్ బామండ్లపెల్లి నరేష్, మోతుకూరి శ్రీనివాస్ లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. వీరంతా జల్సాలకు అలవాటుపడి, సులువుగా డబ్బు సంపాదించేందుకు చోరీల మార్గాన్ని ఎంచుకున్నారని, ఈ క్రమంలో కొంతకాలంగా ఇండ్లలో నిలిపి ఉన్న వాహనాలను టార్గెట్ చేసుకొని బ్యాటరీలు ఎత్తుకెళ్తున్నట్టు చెప్పారు. శుక్రవారం బాధిత వాహన యజమాని నల్లపురి దేవేందర్ తన ఇంటి ముందు నిలిపిన ట్రాక్టరు, ఆటో బ్యాటరీలను గుర్తు తెలియని దుండగులు చోరి చేసినట్లు ఫిర్యాదు చేయగా పోలీసులు చెల్పూర్ గాంధీ జంక్షన్ లో వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదస్థితిలో నలుగురు వ్యక్తులు తచ్చాడుతూ కనిపించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా వివిధ వాహనాల నుంచి దొంగిలించిన బ్యాటరీలను భూపాలపల్లి పట్టణంలో విక్రయించడానికి వెళుతున్నట్లు ఒప్పుకోవడంతో వారిని కస్టడీలోకి తీసుకొని రిమాండుకు తరలించారు. నిందితులను పరకాల జైలుకు తరలించినట్లు ఎస్సై అభినవ్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments