Thursday, April 17, 2025
Homeక్రైమ్రైతును బలి తీసుకున్న అప్పులు

రైతును బలి తీసుకున్న అప్పులు

రైతును బలి తీసుకున్న అప్పులు
స్పాట్ వాయిస్ దామెర: అప్పులు రైతును బలి తీసుకున్నాయి. మండలంలోని ఒగ్లాపూర్ గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. దామెర ఎస్సై హరిప్రియ కథనం ప్రకారం.. మండలంలోని ఒగ్లాపూర్ గ్రామానికి చెందిన దామెర రమేష్ (35) 2 ఎకరాల భూమితో పాటు, మరో రైతుకు చెందిన 3 ఎకరాల భూమి కౌలుకు తీసుకొని పత్తి పంట సాగు చేశాడు. అయితే అకాల వర్షాలతో పంట సరిగా పండకపోవడంతో సాగు కోసం చేసిన రూ.5 లక్షల అప్పు తీర్చే దారి కనిపించడగా.. మనస్తాపనికి గురై గ్రామ శివారులో ఈనెల 23న పురుగుల మందు తాగాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మృతుడు రమేష్ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య సరిత గురువారం ఫిర్యాదు చేయగా, ఎస్సై హరిప్రియ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments