Thursday, September 19, 2024
Homeక్రైమ్చికిత్స పొందుతూ కార్పొరేటర్ మృతి..

చికిత్స పొందుతూ కార్పొరేటర్ మృతి..

స్పాట్ వాయిస్, కాజీపేట: గ్రేటర్ వరంగల్ 61 వ డివిజన్ కార్పొరేటర్ ఎలకంటి రాములు అనారోగ్యంతో చికిత్స పొందుతూ గురువారం హైదరాబాదులోని ఓ ప్రైవేటు హాస్పిటల్ గురువారం సాయంత్రం మృతి చెందాడు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కార్పొరేటర్ ఎలకంటి రాములు మూడు రోజుల క్రితం అస్వస్థతకు గురై వరంగల్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. పరిస్థితి విషమించడంతో డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. రాములు గతంలో టీడీపీ పార్టీలో పనిచేసి తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ లో చేరి ఉద్యమంలో చురుగ్గా పనిచేశారు. గతంలో జరిగిన కార్పొరేటర్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ నుండి 61 డివిజన్ కార్పొరేటర్ గా పోటీ చేసి ఎన్నికల్లో గెలిచాడు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు..

RELATED ARTICLES

Most Popular

Recent Comments