Sunday, May 19, 2024
Homeజనరల్ న్యూస్భయపెడుతున్న కరోనా..

భయపెడుతున్న కరోనా..

భయపెడుతున్న కరోనా..

నిన్న 6,155.. నేడు 5,357 కేసులు..

ఆంక్షల బాట పడుతున్న రాష్ట్రాలు

స్పాట్ వాయిస్, బ్యూరో: దేశంలో కరోనా కేసులు భయపెడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 5,357 కేసులు నమోదు అయినట్లుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య కాస్త తగ్గింది. తాజా కేసులతో కలిపి దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 32,814కు చేరుకుంది. వైరస్ కు మరో 11 మంది బలయ్యారు.

నిన్న 6,155

శనివారం దేశవ్యాప్తంగా కొత్తగా 6,155 కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా మళ్లీ పడగ విప్పుతుండటంతో కొన్ని రాష్ట్రాలు మరోసారి ఆంక్షల బాట పడుతున్నాయి. కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఆదేశాలు జారీ చేస్తున్నాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments