Friday, September 20, 2024
Homeజాతీయంఒక్కరోజే 2,151కి కరోనా

ఒక్కరోజే 2,151కి కరోనా

రోజురోజుకూ పెరుగుతున్న కేసులు
స్పాట్ వాయిస్, బ్యూరో: దేశంలో కొవిడ్ విజృంభిస్తోంది. జనం రోజురోజుకు వైరస్ బారిన పడుతున్నారు. మంగళవారం ఒక్కరోజే 2,151 మంది కరోనా కోరల్లో చిక్కుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 12 వేలకు చేరింది. సైలెంట్ గా విస్తరిస్తున్న మహమ్మారిపై అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఒకే రోజు 2 వేల పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆందోళనకర పరిస్థితులు మళ్లీ వస్తాయా అనే అనుమానులు మొదలయ్యాయి. గత రెండు సీజన్స్ లోనూ ఎండాకాలంలోనే వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని.. ఈసారి కూడా ఆ సంకేతాలు కనిపిస్తున్నాయంటూ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను హెచ్చరించింది. ప్రజలు ముందస్తుచర్యల్లో భాగంగా సామాజిక దూరం పాటిస్తూ.. మాస్క్ ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments