Saturday, September 21, 2024
Homeతెలంగాణరెట్టింపవుతున్న కరోనా

రెట్టింపవుతున్న కరోనా

గురువారం 494 కేసులు
స్పాట్ వాయిస్, హైదరాబాద్: రాష్ర్టంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం 28,865 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 494 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి 126 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,048 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది. జీహెచ్‌ఎంసీలో కొత్తగా 315 కేసులు నమోదయ్యాయి. గతవారంతో పోలిస్తే గురువారం రెట్టింపు కేసులు నమోదు అయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు ప్రకటించారు. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments