Monday, May 26, 2025
Homeక్రైమ్గొంతులో ఇరుక్కున్న మొక్కజొన్న గింజ

గొంతులో ఇరుక్కున్న మొక్కజొన్న గింజ

గొంతులో ఇరుక్కున్న మొక్కజొన్న గింజ..

 మూడేళ్ల చిన్నారి మృతి

స్పాట్ వాయిస్, ఖమ్మం: మొక్కజొన్న గింజ గొంతులో ఆగడంతో మూడేళ్ల బాలిక మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. ఈ విషాద ఘటన చుంచుపల్లి మండలం రాంపురo లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటకృష్ణ – అశ్విని దంపతుల మూడేళ్ల కూతురు బిందుశ్రీ మంగళవారం రాత్రి మొక్కజొన్న కంకులు తింది అయితే ఒక గింజ గుంతులో అడ్డుపడటంతో చిన్నారికి శ్వాస తీసుకోవడం ఇబ్బంది గా మారింది. గమనించిన తల్లిదండ్రులు వెంటనే కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని, ఖమ్మం, హైదరాబాద్ తరలించాలని అక్కడి డాక్టర్లు సూచించారు. కూలి పనులు చేసుకునే వెంకటకృష్ణ డబ్బుల కోసం తిరిగి తిరిగి హైదరాబాద్ తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో పాప ప్రాణం పోయింది

RELATED ARTICLES

Most Popular

Recent Comments