Sunday, May 25, 2025
Homeక్రైమ్కూలర్ లో నీళ్లు పోస్తూ కానిస్టేబుల్ మృతి

కూలర్ లో నీళ్లు పోస్తూ కానిస్టేబుల్ మృతి

స్పాట్ వాయిస్, ములుగు: సెలవుపై ఇంటికి వచ్చిన కానిస్టేబుల్‌ ప్రమాదవాశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఈ విషాద ఘటన ములుగు జిల్లా వాజేడు మండలంలో చోటుచేసుకుంది. శ్రీరామ్‌నగర్‌ గ్రామానికి చెందిన తాటి మహేందర్‌ (30) అరుణాచల్‌ప్రదేశ్‌ లో ఇండో టిబెటియన్‌ బోర్డర్‌ పోలీస్‌శాఖలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల ఆయన సెలవుపై స్వగ్రామానికి వచ్చాడు. శనివారం ఇంటిలోని కూలర్‌లో నీళ్లు పోస్తుండగా విద్యుత్‌ షాక్‌ కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, మూడునెలల బాబు ఉన్నారు. ఏటూరు నాగారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments