Friday, September 20, 2024
Homeరాజకీయంకాంగ్రెస్ కఠిన నిర్ణయం..

కాంగ్రెస్ కఠిన నిర్ణయం..

12మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు..
కఠిన నిర్ణయం తీసుకున్న టీపీసీసీ చీఫ్
స్పాట్ వాయిస్, హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కఠిన నిర్ణయాన్ని తీసుకున్నారు. కాంగ్రెస్ నుంచి గెలుపొంది బీఆర్ఎస్ లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు శుక్రవారం సీఎల్పీలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కొందరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు భేటీ కానున్నారు. అనంతరం సీఎల్పీ నుంచి కాంగ్రెస్‌ నాయకుల బృందం మొయినాబాద్ పీఎస్‌కు వెళ్లి.. బీఆర్‌ఎస్​లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేయనున్నారు. బీఆర్‌ఎస్​లో చేరి 12 మంది ఎమ్మెల్యేలు పొందిన ఆర్థిక, రాజకీయ లబ్ధిపై ఫిర్యాదులో పేర్కొననున్నారు. ఒకవైపు ఎమ్మెల్యేలకు ఎర కేసు సిట్, సీబీఐ, హైకోర్టులలో వాదనలు జరుగుతున్న క్రమంలో కాంగ్రెస్ ఈ విషయంలో ఫిర్యాదు చేస్తుండడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్​గా మారింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments