పోలీస్ స్టేషన్ కు రమ్మన్నారని..
స్టేషన్ లో వారి ఎదుటే ఆత్మహత్య యత్నం
గణపురం పోలీస్ స్టేషన్ లో ఘటన
స్పాట్ వాయిస్, గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో షాకైన పోలీసులు అతడిని వెంటనే 108 వాహనంలో ములుగు సివిల్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే… గణపురం మండల పరిధిలోని గాంధీనగర్ గ్రామానికి చెందిన మోటపోతుల రాజు అనే వ్యక్తి కొందరి వద్ద అప్పు చేశాడు. అప్పులు ఇచ్చిన వ్యక్తులు రాజు తల్లిదండ్రులను అప్పు తీర్చమని ఒత్తిడి చేయడంతోపాటు వేధించారు. ఈ విషయంపై తల్లిదండ్రులు కొడుకును మందలించడంతో రాజు వారిపై దాడి చేశాడు. దీంతో తమ కొడుకు రాజు కొట్టాడని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతడిని విచారణ నిమిత్తం బుధవారం స్టేషన్కు పిలిపించారు. దీంతో అవమానం తట్టుకోలేకపోయిన రాజు స్టేషన్ ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశాడు.
పోలీస్ స్టేషన్ కు రమ్మన్నారని..
RELATED ARTICLES
Recent Comments