పూజలు చేసిన భక్తులు
స్పాట్ వాయిస్, హుజూరాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోని శివరామాలయంలో నాగుపాము హల్చల్ చేసింది. శనివారం ఉదయం ఓ నాగుపాము ఆలయంలోని శివలింగంపైకి చేరుకొని పడగ విప్పింది. మొదట భక్తులు బయపడినప్పటికీ అనంతరం నాగుపాము శివలింగం చుట్టూ చుట్టుకోవడం చూసి భక్తులు దండాలు పెట్టారు. కొద్దిసేపు ఆ పాము ఆలయం తిరిగి అనంతరం ఆలయం నుంచి బయటకు వెళ్లిపోయింది. ఈ దృశ్యాన్ని చూసిన భక్తులు ఓం నమశివాయ అంటూ కొందరు.. దేవుడి మహిమ అని కొందరు మాట్లాడుకుంటున్నారు.
Recent Comments