Saturday, September 21, 2024
Homeరాజకీయంమన సీఎమ్మే.. దేశానికి కాబోయే పీఎం

మన సీఎమ్మే.. దేశానికి కాబోయే పీఎం

దసరా తర్వాత కేసీఆర్ చక్రం తిప్పుతారు..
కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి
స్పాట్ వాయిస్, హన్మకొండ: భార‌తీయ జ‌న‌తా పార్టీ నుంచి దేశానికి విముక్తి క‌ల్పించాల‌ని భ‌ద్రకాళీ అమ్మవారిని ప్రార్థించాన‌ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మ‌ల్లారెడ్డి తెలిపారు. కేసీఆర్‌ను ఈ దేశానికి ప్రధాని కావాలని అమ్మవారిని మొక్కుకున్నాన‌ని ఆయ‌న‌ చెప్పారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో హన్మకొండలోని తారా గార్డెన్ లో ఏర్పాటు చేసిన కార్మిక మాసోత్సవ స‌ద‌స్సులో మంత్రి మ‌ల్లారెడ్డి పాల్గొని మాట్లాడారు. బీజేపీ అంటేనే జూటా పార్టీ అన్నారు. దేశాన్ని బీజేపీ ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆరోపించారు. దొంగ‌లు దేశాన్ని దోచుకుని విదేశాల్లో జ‌ల్సాలు చేస్తున్నారని, దేశంలో మాత్రం పేద‌ల‌పై ప‌న్నుల భారం మోపుతున్నార‌ని మండిప‌డ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చేది లేదు.. స‌చ్చేది లేద‌ని తేల్చిచెప్పారు. విజ‌య ద‌శ‌మి త‌ర్వాత దేశ రాజ‌కీయాల్లో కేసీఆర్ చ‌క్రం తిప్పుతార‌ని పేర్కొన్నారు. కేసీఆర్ ఈ దేశానికి ప్రధాని కావాల‌ని మ‌ల్లారెడ్డి ఆకాంక్షించారు. దసరా రోజు భద్రకాళిని కేసీఆర్‌ దర్శించుకుంటారు.అమ్మవారికి మొక్కి దేశ రాజకీయాల కోసం బయల్దేరుతారని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments