Sunday, June 8, 2025
Homeలేటెస్ట్ న్యూస్ఎకరానికి రూ.10వేలు

ఎకరానికి రూ.10వేలు

ఎకరానికి రూ.10వేలు

మా రైతును మేమే ఆదుకుంటాం..

సీఎం కేసీఆర్

స్పాట్ వాయిస్, బ్యూరో: కేంద్రoతో సంబంధం లేకుండా ఇండియాలోనే ఫస్ట్ టైం కేవలం రాష్ట్ర ప్రభుత్వమే నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేలు ఇస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా గాలివానతో వేల ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. దీంతో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రామాపురాన్ని సందర్శించారు. నష్టపోయిన రైతులతో మాట్లాడి, అకాల వర్షాలతో పాడైన వరి, మొక్కజొన్న, మామిడి పంటలను ఆయన పరిశీలించారు. మొత్తం 79 వేల ఎకరాల్లో వరి పంట నష్టానికి గురైందని సీఎం కేసీఆర్ తెలిపారు. రైతులు నిరాశకు గురికావల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. పంట నష్టపరిహారంపై గతంలో కేంద్రానికి నివేదికలు పంపినా నష్టపరిహారం ఇవ్వలేదని.. ఈ విషయంలో కేంద్రానికి ఎలాంటి రిపోర్ట్స్ పంపమని సీఎం స్పష్టంగా చెప్పారు. తమ రైతులను తామే ఆదుకుంటామన్నారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేలు అందజేస్తామని, కౌలు రైతులను సైతం ఆదుకునేలా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు. వాళ్లక్కూడా న్యాయం చేస్తామన్నారు. ఎకరానికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.228కోట్లను ఇప్పుడే మంజూరు చేస్తున్నామని సీఎం కేసీఆర్ వివరించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments