Thursday, September 26, 2024
Homeజిల్లా వార్తలుసీఎం చిత్రపటానికి ఫీల్డ్ అసిస్టెంట్ల క్షీరాభిషేకం

సీఎం చిత్రపటానికి ఫీల్డ్ అసిస్టెంట్ల క్షీరాభిషేకం

సీఎం చిత్రపటానికి ఫీల్డ్ అసిస్టెంట్ల క్షీరాభిషేకం…

స్పాట్ వాయిస్, ఎల్కతుర్తి : ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలంటూ కలెక్టర్,డీఆర్డీఓ లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం పట్ల మండలంలోని ఫీల్డ్ అసిస్టెంట్ లు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మండల కేంద్రంలో గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ , పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు , ఎమ్మెల్యే సతీష్ కుమార్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర సహాయకుల సంఘం జిల్లా కార్యదర్శి ఎదురుగట్ల రాజేష్, మైసా కిరణ్ కుమార్ , మండల అధ్యక్షుడు నీలికొండ సంతోష్, ప్రధాన కార్యదర్శి నాగం రాజయ్య, కోశాధికారి వేముల చంద్రకళ , దార స్వరూప , సంపత్, క్రాంతి కుమార్ , కిరణ్ కుమార్ , సదానందం , అనూష తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments