Saturday, April 19, 2025
Homeలేటెస్ట్ న్యూస్సీఎం కేసీఆర్ వరాలు..

సీఎం కేసీఆర్ వరాలు..

స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా కొత్త పింఛన్లు
డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్
స్పాట్ వాయిస్, హైదరాబాద్: కొత్త పెన్షన్లపై సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన చేశారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్లు సీఎం తెలిపారు. శనివారం ప్రగతి భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కొత్తగా 10లక్షల మందికి పెన్షన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం 36లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా కొత్త పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో మొత్తం పింఛన్‌దారుల సంఖ్య 46లక్షలకు చేరుకుంటుందని చెప్పారు. 57 సంవత్సరాలున్న వారికి పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్తగా డయాలసిస్‌ పేషెంట్లకు సైతం రూ.2016 పింఛన్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments