Monday, September 30, 2024
Homeలేటెస్ట్ న్యూస్బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే చల్లా పరామర్శ

బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే చల్లా పరామర్శ

బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే చల్లా పరామర్శ
స్పాట్ వాయిస్, దామెర : ఇటీవల రోడ్డు ప్రమాదంలో మండలంలోని పులుకుర్తి గ్రామానికి చెందిన గుర్రం కిరణ్ చనిపోయాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదివారం గ్రామానికి వెళ్లి కిరణ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ప్రమాదానికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. మృతుడి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం మండలంలోని ఊరుగొండ గ్రామానికి చెందిన టీఆర్ ఎస్ పార్టీ గ్రామ యూత్ అధ్యక్షుడు దొంగల వినోద్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చల్లా వినోద్ ను పరామర్శించి బాగోగులు తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, మండల నాయకులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments