Thursday, September 19, 2024
Homeజిల్లా వార్తలునిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలి

నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలి

గణపురం ఎస్సై అశోక్
స్పాట్ వాయిస్, గణపురం: గణేశ్‌ విగ్రహాల నిమజ్జన వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని గణపురం ఎస్సై రేఖ అశోక్ సూచించారు. ఆదివారం మండల కేంద్రంలో పలు వినాయక మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఐబీ రోడ్డులో శ్రీ సాయిరాం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ఎస్సై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. వినాయక నిమజ్జనాలు చేసేటప్పుడు యువకులకు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నారగాని దేవేందర్ గౌడ్, మాజీ ఎంపీటీసీ మోటపోతుల శివశంకర్ గౌడ్, భూపాలపల్లి మార్కెట్ డైరెక్టర్ రేపాక రాజేందర్, యూత్ అసోసియేషన్ సభ్యులు గుర్రం తిరుపతి, గుర్రం సురేష్, బూర రాజ్ గోపాల్, గుర్రం శేషు, పాలకుర్తి వెంకటేష్, గుర్రం నిఖిల్, పల్లే రాజేష్, బూర శరత్, పాలకుర్తి విశాల్, గుర్రం రోహిత్, ఆనంద్, ఆరేల్లి అభిలాష్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments