Monday, September 23, 2024
Homeజిల్లా వార్తలుసీసీ కెమెరాల ఏర్పాటు అభినందనీయం

సీసీ కెమెరాల ఏర్పాటు అభినందనీయం

 సీఐ నరేష్ కుమార్
స్పాట్ వాయిస్, భూపాలపల్లి టౌన్: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జవహర్ నగర్ కాలనీలో ఇటీవల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సీసీ కెమెరాల ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. స్పందించిన కాలనీ వాసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోగా ఆదివారం సీఐ దొమ్మాటి నరేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. సీసీ కెమెరాల ఏర్పాటు అభినందనీయమని అన్నారు. ఒక్క సీసీ కెమెరా 100 వంద మంది పోలీసులతో సమానమని, నేరాలు అదుపులో కీలకంగా పని చేస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ నూనె రాజు, మాజీ వైస్ చైర్మన్ ఎరుకల గణపతి, కాలనీ పెద్దలు చిర్ర రమేష్, పెరుమాండ్ల తిరుపతి గౌడ్, కాలనీవాసులు హెచ్ సి శ్రీనివాస్, కానిస్టేబుల్లు శ్రీకాంత్, రాజు, డబ్ల్యూ పీసీ శ్యామల తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments