Tuesday, June 17, 2025
Homeక్రైమ్అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత

స్పాట్ వాయిస్, గణపురం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మండల పరిధిలోని కర్కపల్లి జాతీయ రహదారి వద్ద ఆదివారం ఉదయం డీసీఎం వ్యాన్‌లో తరలిస్తున్న పశువులను పట్టుకున్నామని ఎస్సై రేఖ అశోక్ తెలిపారు. భూపాలపల్లి మండలం గుర్రంపేట గ్రామం నుంచి 29 పశువులను వ్యాన్‌లో కుక్కి… హన్మకొండకు తరలిస్తుండగా పట్టుకున్నామన్నామని ఆయన తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న సిద్ధిపేట జిల్లాకు చెందిన డ్రైవర్ బుజ్నూరు కుమార్, వరంగల్ కు చెందిన యజమాని మహమ్మద్ ముజ్జుమిల్లాపై కేసు నమోదు చేశామని ఎస్సై వెల్లడించారు. కాగా, పట్టుకున్న పశువులను భూపాలపల్లి మండలం రాంపూర్ గోశాలకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments