Saturday, September 21, 2024
Homeజిల్లా వార్తలుకేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రచారం

కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రచారం

స్పాట్ వాయిస్, నర్సంపేట టౌన్: ప్రధాని నరేంద్ర మోడీ ఎనిమిదేళ్ల పాలన ముగిసిన సందర్భంగా సేవా, సుపరిపాలన, గరీబ్ కళ్యాణ్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని నర్సంపేట పట్టణంలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై నర్సంపేట టౌన్ ప్రెసిడెంట్ బాల్నే జగన్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నర్సంపేట నియోజకవర్గ బీజేపీ నాయకులు డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి హాజరై పట్టణంలో ఉన్న ప్రతీ షాప్‌కు తిరుగుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశానికి, నర్సంపేట నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై కేంద్ర ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో వివరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సర్వాపురం నాయకులు శీలం సత్యనారాయణ, బీజేపీ సీనియర్ నాయకులు ప్రవీణ్ చారి, బీజేవైఎం అధ్యక్షుడు మల్యాల వంశీ, బీజేవైఎం ప్రధాన కార్యదర్శులు సామల ప్రవీణ్, బొడిగే ఈశ్వర్, వల్లబ్ నగర్ బీజేపీ నాయకులు చేపూరి నాగరాజు, అబ్బారాబోయిన రాజు, బొల్లేపెళ్లి నగేష్, భైరగొని రఘు, ఉరటి శ్రీకాంత్, గుడెపు రంజిత్, కోరుపోజు సురేష్, బొడిగే క్రాంతి, సంపంగి వెంకటేష్, ఇంజపురి సుమన్, పాలకుర్తి రంజిత్, ముస్కు ప్రేమ్ రెడ్డి, వెంకటేష్, ములుక వినయ్, వంగ ప్రేమ్, బొల్లి శరత్, రాజేంద్రప్రసాద్, మహేందర్, పొదిళ్ల రాము, జినుకల ఉపేందర్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments