Sunday, June 8, 2025
Homeతెలంగాణఇంటివద్దకే ‘బూస్టర్ డోస్’

ఇంటివద్దకే ‘బూస్టర్ డోస్’

ప్రకటించిన వైద్యారోగ్య శాఖ మంత్రి
కరోనా పెరుగుతున్న క్రమంలో సర్కార్ నిర్ణయం
స్పాట్ వాయిస్, హైదరాబాద్: కరోనా విజృంభిస్తున్న వేళా.. తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి ఇంటింటికీ వెళ్లి బూస్టర్‌ డోస్‌ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. దేశ వ్యాప్తంగా రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నయన్ని మంత్రి… రాష్ట్రంలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. కరోనా విషయంలో అలసత్వం వద్దని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. మాస్కులు, శానిటైజర్లు కచ్చితంగా వాడాలని సూచించారు. ప్రతి ఒక్కరూ బూస్టర్ డోస్ వేయించుకోవాలని చెప్పారు. మంకీపాక్స్‌పై ఆందోళన అవసరం లేదని హరీశ్‌ స్పష్టంచేశారు. ప్రజాప్రతినిధులు సైతం కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను కోరారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments