హనుమకొండలో బస్సు బోల్తా..
15 మంది ప్రయాణికులకు గాయాలు..
స్పాట్ వాయిస్, క్రైమ్: హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం చింతగట్టు రింగ్ రోడ్డు బ్రిడ్జి వద్ద మంగళవారం ఉదయం ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఒంగోలు నుంచి ఆదిలాబాద్ వెళ్లే లహరి బస్సుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108లో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
Recent Comments