Friday, April 18, 2025
Homeలేటెస్ట్ న్యూస్వరదల్లో చిక్కుకున్న స్కూల్ బస్సు

వరదల్లో చిక్కుకున్న స్కూల్ బస్సు

స్పాట్ వాయిస్, నర్సింహులపేట: మహబూబాబాద్ జిల్లాలో శుక్రవారం భారీ వర్షాలు పడ్డాయి. వరద నీరు ప్రధాన రహదారి‌పై నుంచి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
తొర్రూరు నుంచి నర్సింహులపేటకు విద్యార్థులతో వస్తున్న ఆర్యభట్ట స్కూల్ బస్సు కొమ్ములవంచ కొత్తచెరువు మత్తడి నీటిలో చిక్కుకుంది. నీరు రోడ్డుపై అధికంగా ప్రవహిస్తుండటంతో స్కూల్ బస్సు రోడ్డు పై నుంచి జారీ కిందకు దిగింది. అయితే బస్సులో విద్యార్థులు ఉన్నప్పటికీ ఎవరికీ ఏమి జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments