అనుమతి కోసం కోర్టుకెక్కిన బీఆర్ఎస్
విచారణ చేపట్టిన హై కోర్టు
17వరకు నిర్ణయం తీసుకోవాలని ఆదేశం..
తదుపరి విచారణ 21కి వాయిదా..
స్పాట్ వాయిస్, బ్యూరో: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈనెల 27న సభ ఉండడంతో ముఖ్యనాయకులంతా జన సేకరణలో ఉండగా.. వరంగల్, కరీంనగర్ గులాబీ నేతలు సభ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అయితే హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే సభకు పోలీసుల నుంచి అనుమతి రాకపోవడంతో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో సభ అనుమతిపై శుక్రవారం విచారణ చేపట్టింది. దీంతో సభకు అనుమతిపై పరిశీలిస్తున్నామని కోర్టుకు ప్రభుత్వ నాయవాది తెలిపారు. వారం రోజుల్లో వరంగల్ సభ అనుమతిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సభ కోసం బీఆర్ఎస్ పెట్టుకున్న పర్మిషన్ను అనుమతించకపోవడం, దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్లే హైకోర్టులో పిటిషన్ వేసినట్లు బీఆర్ఎస్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. 17వ తేదీ లోపు సభ అనుమతిపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 21 కి వాయిదా వేసింది. అలాగే వరంగల్ పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
బీఆర్ఎస్ రజతోత్స సభకు నో పర్మిషన్
RELATED ARTICLES
Recent Comments