Saturday, September 21, 2024
Homeతెలంగాణబీఆర్ఎస్ నుంచి మరొకరి జంప్.. 

బీఆర్ఎస్ నుంచి మరొకరి జంప్.. 

బీఆర్ఎస్ నుంచి మరొకరి జంప్.. 

స్పాట్ వాయిస్, బ్యూరో: బీఆర్ఎస్​ పార్టీకి మరో షాక్​ తగిలింది. నాయకులంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సైతం కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆదివారం కాంగ్రెస్​ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బోధన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.

ఇప్పటి వరకు ఐదుగురు..

సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరికతో ఇప్పటివరకు బీఆర్ఎస్ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరినట్లు అయింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్​ ఘన్​పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరగా, తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments