Friday, September 20, 2024
Homeక్రైమ్తేనెటీగల దాడి.. బావిలో దూకిన అన్నదమ్ములు..

తేనెటీగల దాడి.. బావిలో దూకిన అన్నదమ్ములు..

తేనెటీగల దాడి..
బావిలో దూకిన అన్నదమ్ములు..
ఈత రాక అన్న మృతి.. ప్రాణాలతో బయటపడిన తమ్ముడు
మానుకోట జిల్లాలో విషాదం..
స్పాట్ వాయిస్, మహబూబాద్: మానుకోట జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లాలోని కొత్తగూడ మండలం నీలంపల్లికి చెందిన అన్నదమ్ములు కోన్ రెడ్డి సంజీవ, జనార్దన్ ఉదయం పొలం పనులకు వెళ్లారు. పనులు చేస్తుండగా.. తేనెటీగలు దాడి చేయడంతో పరుగులు పెట్టారు. ఈక్రమంలో తేనెటీగల నుంచి తప్పించుకోవడానికి సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో ఇద్దరు దూకారు. అయితే కోన్ రెడ్డి సంజీవకు ఈత రాకపోవడంతో మునిగి మృతి చెందాడు. తమ్ముడు సంజీవ ప్రాణాలతో బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments