Friday, September 20, 2024
Homeక్రైమ్పెన్షన్ కోసం అన్నదమ్ముల గొడవ..

పెన్షన్ కోసం అన్నదమ్ముల గొడవ..

పెన్షన్ కోసం అన్నదమ్ముల గొడవ..
మధ్యలో వెళ్లిన బావ బలి..
స్పాట్ వాయిస్, జగిత్యాల: ఆవులు ఆవులు కొట్లాడి లేగ దూడ కాళ్లు ఇరగొట్టినట్లు.. అన్నదమ్ములు ఇద్దరు కొట్లాడుకొని బావను బలి తీసుకున్నారు. ఈ ఘోర ఘటన జ‌గిత్యాల‌ జిల్లాలోని విజ‌య‌పూరిలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. విజ‌య‌పూరికి చెందిన ఇద్దరు అన్నద‌మ్ముళ్లు హయత్, తాజ్ తల్లి వజీర్ కు నెలనెలా వృద్ధాప్య పింఛన్ తీసుకుంటోంది. ఈనెల ఆమె పెన్షన్ తీసుకోగా.. ఆ డబ్బులు (రూ.2వేలు) తనకు కావాలంటే తనకు కావాలంటూ అన్నదమ్ములు శుక్రవారం గొడ‌వ ప‌డ్డారు. వీరి గొడ‌వ‌ను ఆపేందుకు వారి బావ సయ్యద్ నయీమ్ ప్రయత్నించాడు. సోద‌రులిద్దరూ కొట్టుకుంటుండ‌గా, తోపులాటలో బావ కిందపడ్డాడు. ఈ క్రమంలో సయ్యద్ నయీమ్ త‌ల‌కు తీవ్ర గాయ‌మైంది. దీంతో బావ అక్కడిక‌క్కడే ప్రాణాలు కోల్పోయాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థలికి చేరుకుని ప‌రిస్థితిని స‌మీక్షించారు. మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకొని కేసు న‌మోదు చేసుకున్నారు. మృతుడి నివాసంలో విషాదం నెల‌కొంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments