Saturday, May 24, 2025
Homeక్రైమ్క్వారీ బ్లాస్టింగ్ లో ఒకరు మృతి

క్వారీ బ్లాస్టింగ్ లో ఒకరు మృతి

గ్రానైట్ క్వారీలో బ్లాస్టింగ్
ఒకరి దుర్మరణం.. ఇద్దరికి  తీవ్ర గాయాలు
స్పాట్ వాయిస్, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తీగలవేణి గ్రామ సమీపంలోని గ్రానైట్ క్వారీలో బుధవారం ఉదయం బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో క్వారీలో జాకీ లేబర్ గా పనిచేస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు కేసముద్రం మండలం అర్పణపల్లి గ్రామానికి చెందిన అమీర్ పాషా గా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి  చేరుకుని విచారణ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, అమీర్ పాషా చనిపోయిన విషయం తెలుసుకున్న బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జాటోతు హుస్సేన్ నాయక్ ఘటనపై ఆరా తీశారు. అతడి కుటుంబానికి ఆదుకోవాలని గ్రానైట్ యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments