Friday, September 20, 2024
Homeజిల్లా వార్తలుఎస్సీలను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

ఎస్సీలను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

బీజేపీ ఎస్సీ మోర్చా పదాధికారుల సమావేశం
స్పాట్ వాయిస్ , వరంగల్: భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా కార్యాలయంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నల్లబెల్లి సుదర్శన్ అధ్యక్షతన శుక్రవారం జిల్లా పదాధికారుల సమావేశం నిర్వహించారు, ఈనెల 31న ఉదయం 10 గంటలకు బీజేపీ అఖిల భారత ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఉత్తేరప్రదేశ్ ఎంపీ,
డీఆర్ బోలా సింగ్ వరంగల్ కు రానున్నా సందర్భంగా ఈ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతి కిరణ్, ఎస్సీ మోర్చా జిల్లా ఇన్ చార్జి బొట్ల శ్రీనివాస్ , రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ రాష్ట్ర SC మోర్చా కార్యవర్గ సభ్యులు మహంకాళి జిల్లా ఇన్ చార్జ్ బన్న ప్రభాకర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీ మోర్చా ప్రధానకార్యదర్శి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ .. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీలను మోసం చేసిందన్నారు. వారు వేసిన ఓట్లతో గద్దెనెక్కిన పాలకులు మర్చిపోయారన్నారు. దళితులను ముఖ్యమంత్రిని చేస్తానని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తాని, మొన్న హుజురాబాద్ ఎన్నికలలో దళిత బంధు అని దళితులందరినీ మోసం చేస్తున్నాడన్నారు,
అదే దళితులను భారతీయ జనతా పార్టీ ఎంతో గౌరవిస్తూ భారత దేశ అతున్నత స్థానం రాష్ట్రపతి హోదాని ఒక దళితునికి ఇచ్చిందన్నారు. ,దళితుల ఆరాధ్య దైవం దాదాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పార్లమెంట్ లో ఆవిష్కరించిందన్నారు.
అనంతరం పార్టీ సంస్థాగత విషయాలపై మాట్లాడుతూ..
పార్టీని పటిష్ట పరిచేందుకు మండల/డివిజన్ కమిటీ ల నిర్మాణం ఎంతో ముఖ్యమన్నారు. ఇప్పటివరకు జరిగిన కమిటీలను సమీక్షించారు. ఈ కార్యక్రమంలో మార్టిన్ లూథర్, మాదాసి రాజు, జన్ను ఆరోగ్యం, పంజాబ్ వేంకటేశ్వర బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శులు చింతం.భాస్కర్ , నలిగంటి నర్సింగ్ , ఉపాధ్యక్షులు జన్ను కుమారు, జిల్లా జిలకర.వీరస్వామి, దండు చక్రపాణి, పోలెపాక జనార్దన్, గబ్బెట సుధాకర్, రవి, బుష్పాక రజిత, గొర్రె కోటేశ్వర్ రంజిత్,ఇల్లందుల కిషన్, జన్ను.ప్రభాకర్,శ్యామ్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments