బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు సుమన్
స్పాట్ వాయిస్, హన్మకొండ రూరల్: బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పార్టీ మారకున్న బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరినట్లు ప్రచారం చేసుకుంటున్నారని, ఇలాంటి చిల్లర చర్యలు మానుకోవాలని కటాక్షపూర్ గ్రామ పార్టీ అధ్యక్షుడు శిరం శెట్టి సుమన్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శనివారం బీజేపీలోకి ఆత్మకూరు మండలంలోని కటాక్ష పూర్ గ్రామానికి చెందిన దుంపలపల్లి జయపాల్ రెడ్డి, వాడకారి రాజు, వాడుకారి రమేష్ బీజేపీలో చేరినట్లు ప్రకటించుకున్నారని, అది ముమ్మాటికి అబద్ధమని వాళ్లు గతం నుంచి ఆ పార్టీనే ఉన్నారని చెప్పారు. బీజేపీ పార్టీ కార్యకర్తలు బీజేపీలోనే చేర్చించుకొని బీఆర్ఎస్ పార్టీ నుంచి చేరినట్లు ప్రచారం చేసుకుంటున్నారని, ఇలాంటివి మళ్లీ పునారవృతం అయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు ఈ సమావేశంలో గ్రామ యూత్ అధ్యక్షుడు కాసు నరేష్, వార్డు సభ్యుడు కుడుతాల రమేష్, సీనియర్ నాయకులు కుసం రవీందర్, మాదరబోయిన రాజు పాల్గొన్నారు.
బీజేపీ నాయకులు దుష్ప్రచారం మానుకోవాలి
RELATED ARTICLES
Recent Comments