Friday, September 20, 2024
Homeజిల్లా వార్తలుకొత్తకొండ రాజు ఆధ్వర్యంలో ఇంటింటికీ బీజేపీ

కొత్తకొండ రాజు ఆధ్వర్యంలో ఇంటింటికీ బీజేపీ

హాజరైన వరంగల్ బీజేపీ అధ్యక్షుడు కొండేటి శ్రీధర్
స్పాట్ వాయిస్, వరంగల్: గ్రేటర్ వరంగల్ 14 వ డివిజన్ లో బీజేపీ ఆధ్వర్యంలో శనివారం మహా జన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే, బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ మోడీ పాలనలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి పనులను వివరించారు. కరపత్రాలు, పోస్టర్లు పంచారు. అనంతరం కొండేటి శ్రీధర్ మాట్లాడుతూ.. నరేంద్రమోడీ నాయకత్వంలో వివిధ వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు బూత్ స్థాయి వరకు చేరాలనే సంకల్పంతో అధిష్టానం మే 30 నుంచి జూన్ 30 వరకు మహా జన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమం చేపట్టిందన్నారు. ఇందులో ఇంటింటికీ బీజేపీ నినాదంతో ముందుకెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు నిజానిజాలు తెలుసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గం 14వ డివిజన్ పరిధిలోని డివిజన్ అధ్యక్షుడు కొత్తకొండ రాజు, 109 బూత్ అధ్యక్షుడు పస్తం శివ ,110 బూత్ అధ్యక్షులు చల్లా రాజు, 112 బూత్ అధ్యక్షురాలు మంతెన అపర్ణ, వరంగల్ జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు శేట్టి చందు పటేల్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు పస్తం సమ్మయ్య,శక్తి కేంద్ర ఇంచార్జ్ దమెర సదానందం, మంతెన చిరంజీవి, కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి చింతనిపుల సాంబయ్య, ఉపాధ్యక్షులు మంతెన శ్రీను, మోర్చా అధ్యక్షురాలు మంతెన దేవిక, దాసోజు ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments