Saturday, May 31, 2025
Homeక్రైమ్బ్రెయిన్ డెడ్‌తో బీజేపీ కార్పొరేటర్ మృతి

బ్రెయిన్ డెడ్‌తో బీజేపీ కార్పొరేటర్ మృతి

స్పాట్ వాయిస్, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ లోని గుడిమల్కాపూర్ కార్పొరేటర్, బీజేపీ నేత దేవర కరుణాకర్ అనారోగ్యంతో చనిపోయారు. గురువారం రాత్రి ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను బంజారాహిల్స్‌ లోని సిటీన్యూరో ఆస్పత్రిలో చేర్పించారు. దవాఖానలో చేరిన కొద్దిసేపటికి కరుణాకర్ చనిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు, పార్టీ నేతలు హాస్పిటల్ వద్ద క్యూ కట్టారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, జీహెచ్ ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. గుడిమల్కాపూర్ డివిజన్ నుంచి దేవర కరుణాకర్ మూడు సార్లు కార్పొరేటర్ గా గెలుపొందారు. గతంలో ఆయన కూతురు భవాని (29) కరోనాతో మృతి చెందారు. ఆమెకు భర్త కార్తీక్, ఓ బాబు ఉన్నాడు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments