Monday, September 23, 2024
Homeక్రైమ్భూపాలపల్లిలో రోడ్డు ప్రమాదం..

భూపాలపల్లిలో రోడ్డు ప్రమాదం..

భూపాలపల్లిలో రోడ్డు ప్రమాదం 
స్పాట్ వాయిస్, గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కుందురుపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. చెల్పూరు గ్రామ పంచాయతీ పరిధిలోని (353 జాతీయ రహదారి) కుందూరుపల్లె పెట్రోల్ బంక్ ససమీపంలో ఆదివారం ఉదయం రోడ్డు వెంట వెళ్తున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రెడ్ కలర్ టీషర్ట్ వేసుకొని ఉన్న మృతుడు సుమారు 30 సంవత్సరాల వయసు ఉంటుంది. మృతుడి కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు. మృత దేహాన్ని పరకాల మార్చురీలో ఉంచినట్లు ఆచూకీ తెలిసినవారు భూపాలపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా సూచించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments